పవన్ కళ్యాణ్ ఆపరేషన్ సక్సెస్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన కుంకీ ఏనుగుల ఆపరేషన్ అద్భుత విజయం సాధించింది. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో అడవి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తూ, రైతుల ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి, అడవి ఏనుగుల గుంపులను అడ్డుకునేందుకు వినూత్న చర్యలు చేపట్టారు.

ఈ ఆపరేషన్ ఫలించడంతో పంటల నష్టం తగ్గడమే కాక, రైతులకు భద్రత కూడా లభించింది. ఈ విజయవంతమైన చర్యలకు రైతులు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా రైతుల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ చూపిన చొరవ మరియు నిబద్ధత సర్వత్రా ఆకర్షిస్తోంది.

Related Articles

Latest Articles