
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (ఎమ్ఎస్జి) మూడో వారంలో కూడా బాక్సాఫీస్లో అజేయంగా దూసుకుపోతోంది. బుక్ మై షో (బిఎమ్ఎస్) ప్లాట్ఫామ్లో ఈ చిత్రం సంచలనాత్మక రికార్డు నమోదు చేసింది.
ఎమ్ఎస్జి రీజినల్ సినిమాల్లో అల్-టైమ్ నెం.1గా నిలిచి, 3.6 మిలియన్ టికెట్లు విక్రయించి మునుపటి రికార్డు ‘సంక్రాంతికి వస్తున్నాం’ (3.59 మిలియన్)ను అధిగమించింది. 14వ రోజు 122.2కే టికెట్లు విక్రయమైన ఈ చిత్రం, ప్లాట్ఫామ్లో ఇప్పటికీ టాప్లో ఉండి, గంటకు 9కే పైగా టికెట్లు అమ్ముతోంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఎమ్ఎస్జి బలమైన ప్రదర్శన కనబరుస్తోంది. నార్త్ అమెరికాలో $3.5 మిలియన్ మైలురాయి వైపు దూసుకుపోతున్న ఈ సినిమా, చిరంజీవి మరియు డైరెక్టర్ అనిల్ రవిపూడి కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలుస్తోంది. వరల్డ్వైడ్ కలెక్షన్లలో ఇద్దరికీ అతిపెద్ద విజయం. పూర్తి రన్లో 400 కోట్ల మార్కును తాకే అవకాశం ఉంది.


