
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీ డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో హాస్యంతో నిండిన ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది. కిషోర్ తిరుమల దీనిని వినోదాత్మకంగా, అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించారు. దక్షిణాది ప్రాంతాల ప్రేక్షకులు దీనిని వారి స్వంత భాషలో ఎక్స్పీరియెన్స్ చేసేలా జీ5లోకి వస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని అన్నారు.
ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ .. ‘నా పాత్రతో మహిళలు ఇట్టే కనెక్ట్ అయ్యారు. పలు రకాల షేడ్స్ ఉన్న నా పాత్రని అందరూ ఇష్టపడ్డారు. ఇక ఇప్పుడు మా సినిమా డిజిటల్ రిలీజ్కు రెడీగా ఉంది. ఓటీటీలోనూ మా మూవీని అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డింపుల్ హయతి మాట్లాడుతూ .. ‘ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటూనే ఎన్నో మంచి విషయాల్ని, సందేశాల్ని ఇస్తుంది. వినోదాత్మకంగా మానవ సంబంధాలను వివరిస్తుంది. ప్రతి పాత్రకు ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ప్రతీ పాత్రకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. జీ5లో కూడా మా సినిమాని ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూడదగ్గ ఈ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మార్చి 13న ZEE5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.


